వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎవరి సొత్తూ కాదు: రోజా

By Pratap
|
Google Oneindia TeluguNews

Roja
గుంటూరు: తెలంగాణ ఎవరి సొత్తూ కాదని ప్రముఖ సినీ నటి రోజా అన్నారు. ప్రజలందరూ కలిసి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ ఉమా మహేశ్వర రావును ఆమె సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నారై ఆస్పత్రి వద్ద ఆందోళన చేయడానికి ప్రయత్నించిన రోజాను పోలీసులు అడ్డుకున్నారు.

దేవినేనితో పాటు ఇతర నాయకుల ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. పథకం ప్రకారమే దేవినేని ఉమను పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని ఆమె ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఆమె రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఆమె అనంతపురం, కడప జిల్లాల్లో పర్యటించారు. కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X