వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెజవాడ పోలీసు కమిషనర్ పై సస్పెన్షన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajendranath Reddy
హైదరాబాద్: పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పరారీ వ్యవహారంపై విజయవాడ పోలీసు కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి సహా దిగవ స్థాయి పోలీసులను సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. మంత్రివర్గ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఎసిపి సెంట్రల్ జోన్ సుబ్బారావు, సిఐలు ధర్మేంద్ర, లక్ష్మీపతి, ఎస్ఐలు ఎస్పీ భాస్కర్ రెడ్డి, కమాలకర్ లపై సస్పెన్షన్ వేటు పడింది. కమిషనర్ స్థాయి అధికారిని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి.

పూర్తి సంఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని, ఆ విచారణ నివేదిక ఆధారంగా రాజగోపాల్ సహా మిగతావారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. రాజగోపాల్ పై కేసు నమోదైనట్లు తెలిపారు. నిమ్స్ కు తరలించాలని రాజగోపాల్ కోరుతున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వర రావు తదితరులు కూడా నిమ్స్ కు తరలించాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఎవరినీ ప్రభుత్వం సహించబోమని ఆయన చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తామని అనుకుంటే సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణలో పరిస్థితి మెరుగుపడిందని, ఈ స్థితిలో సీమాంధ్రలోని ఉద్యమాన్ని తిరిగి వారిని హైదరాబాదుకు తరలించడం ద్వారా పెంచదలుచుకోలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X