వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలతో తెలంగాణ ఎంపీల ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గినందుకు నిరసనగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా రాజీనామా బాట పట్టారు. తెలంగాణకు చెందిన ఆరుగురు పార్లమెంటు సభ్యులు రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి బుధవారం రాజీనామా చేయగా, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు గురువారం రాజీనామాలు సమర్పించడం ప్రారంభించారు. పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ గురువారం ఉదయం రాజీనామా చేశారు. తాజాగా, నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 మంది వివిధ పార్టీలు చెందిన శాసనసభ్యులు రాజీనామా చేశారు.

తెలంగాణ పార్లమెంటు సభ్యులు గురువారం ఆంధ్రభవన్ లో సమావేశమై భవిష్యత్తును నిర్ణయించుకోనున్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలను వారు కలుసుకుంటారు. అవసరమైతే ఢిల్లీలో నిరాహార దీక్షలకు దిగేందుకు కూడా సిద్ధమవుతున్నారు. బుధవారం చిదంబరం ప్రకటన వెలువరించిన తర్వాత తెలంగాణ పార్లమెంటు సభ్యుల నుంచి ఒక రకంగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై సర్వే సత్యనారాయణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారు నమ్మకం వ్యక్తం చేశారు. చిదంబరం ప్రకటన తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో, తెలంగాణలోని తాజా పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X