వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రులు రాజీనామా చేయాలి: దామోదర్ రెడ్డి
తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్తామని ఆయన చెప్పారు. పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లు ప్రతిపాదించాలని, లేదంటే తమ రాజీనామాలను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్రశాంతంగా ఆందోళన సాగించాలని జానా రెడ్డి కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పులను, లాఠీచార్జీని ఆయన ఖండించారు. ఆర్టీసి చైర్మన్ పదవికి కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు రాజీనామా చేశారు.
Comments
Story first published: Thursday, December 24, 2009, 13:16 [IST]