వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోరు తెలంగాణ: 30న జెఎసి బంద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తెలంగాణలో సమైక్య పోరుకు సిద్ధమయ్యాయి. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)లో తెలుగుదేశం పార్టీ కూడా చేరింది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల జెఎసి ఆదివారం రాత్రి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. 28, 29 తేదీల్లో నిరసనలు, దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన తెలంగాణకు బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు వెంటనే రాజ్యాంగపరమైన చర్యలు ప్రారంభించాలని జెఎసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలను ఆమోదించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కూడా జెఎసి నిర్ణయించింది.

కాగా, విద్యార్థుల సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) వచ్చే ఏడాది 3వ తేదీన మహాగర్జన చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ర్స్ కళాశాల వద్ద దాదాపు 5 లక్షల మందితో మహా గర్జన సదస్సు నిర్వహించాలని జెఎసి నిర్ణయించింది. అయితే దీనికి అనుమతి లేదని పోలీసు అధికారులు చెప్పారు. ఎవరూ హైదరాబాద్ రావద్దని సూచించారు. ఉస్మానియాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆదివారం పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X