వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొయిలీతో తెలంగాణ మంత్రుల భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో స్పష్టత కావాలని, తెలంగాణ ఏర్పాటుకు నిర్దిష్ట కాల పరిమితి కావాలని కోరుతున్న ఈ ప్రాంత మంత్రులు సోమవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు నివాసంలో విందు అనంతరం వారు మొయిలీ వద్దకు వెళ్లారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాందీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన అనంతరం సంభవించిన పరిణామాలపై తెలంగాణ మంత్రులు మొయిలీకి వివరించారు. తమకు సంతృప్తికరమైన ప్రకటన వచ్చే వరకు తమ రాజీనామాలను ఉపసంహరించుకోబోమని మంత్రి జూపల్లి కృష్ణారావు అంతకు ముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమకు ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన హామీతో సంతృప్తి చెందామని, రాజీనామాల ఉపసంహరణపై ఆలోచన చేస్తున్నామని వచ్చిన వార్తల్లో నిజం లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X