వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై త్వరలో శుభవార్త: ప్రణబ్ ముఖర్జీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
హైదరాబాద్: తెలంగాణపై త్వరలో శుభవార్త వింటారని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ మంత్రులకు హామీ ఇచ్చారు. అయితే రాజీనామాలు ఉపసంహరించుకోవాలని ఆయన మంత్రులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం నుంచి స్పష్టత కావాలని, దానికి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని వారు ప్రణబ్ ముఖర్జీని కోరారు. తెలంగాణ మంత్రులు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. వారు నేరుగా కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. ఆయనతో దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. తమ అభిప్రాయాన్ని అధిష్టానం పెద్దలకు తెలియజేయాలని వారు జైపాల్ రెడ్డిని కోరారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రులు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావును కలిశారు. ఆయనతో అరగంట పాటు చర్చలు జరిపారు.

తమకు మంత్రి పదవుల కన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని తాము ప్రణబ్ కు చెప్పినట్లు మంత్రి గీతారెడ్డి చెప్పారు. ప్రణబ్ హామీతో తాము సంతృప్తి చెందామని, రాజీనామాలు ఉపసంహరించుకునే విషయంపై ఆలోచన చేస్తున్నామని మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కేంద్రం నుంచి ప్రత్యేక వార్త కోసం తాము ఎదురు చూస్తున్నామని గీతా రెడ్డి చెప్పారు. తమకు సహకరించడానికి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అంగీకరించినట్లు ఐటి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X