వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపి రైలు ప్రమాదాల్లో పది మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Train Accident
కాన్పూర్: దట్టమైన పొగం మంచు కారణంగా ఉత్తరప్రదేశ్ రాష్టంలో శనివారం ఉదయం జరిగిన మూడు రైలు ప్రమాదాల్లో పది మంది మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 15 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. భివానీ - గోరఖ్ పూర్ మధ్య నడిచే గోరఖ్ దామ్ ఎక్స్ ప్రెస్ రైలు కాన్పూరు జిల్లాలోని పాంకీ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రయాగ్ రాజ్ ఎక్సుప్రెసు రైలును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించినట్లు రైల్వే అధికారులు చెప్పారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు.

సీతామారహీ లివాచీ ఎక్స్ ప్రెస్ రైలు మగధ ఎక్స్ ప్రెసు రైలును ఢీకొన్న సంఘటన కూడా ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లిచావీ రైలు డ్రైవర్ గాయపడ్డాడు. మరో సంఘటనలో సరయూ ఎక్ర్ ప్రెస్ రైలు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏ విధమైన ప్రాణ నష్టం సంభవించేలదు. ఈ మూడు ప్రమాదాల వల్ల ఢిల్లీ - కాన్పూరుల మధ్య నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X