చిరుకు తాడూ బొంగరం లేదు: డి శ్రీనివాస్

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనేది మజ్లీస్ వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. చర్చల ప్రక్రియ కొంత కాలం కొనసాగుతుందని, అయితే సాధ్యమైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. రెండు మూడు నెలల్లో చర్చల ప్రక్రియ పూర్తి కావచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications