వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ను సమైక్యవాదిని చేస్తాం: లగడపాటి రాజగోపాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కూడా సమైక్యవాదిగా మారుస్తామని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని మార్చామని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్యలోకి వచ్చారని, కెసిఆర్ ను కూడా తాము సమైక్యవాదిగా మారుస్తామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో న్నారు. రాష్ట్రంలోని 90 శాతం మంది ప్రజలు సమైక్యాంధ్ర ప్రదేశ్ నే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ నుంచి విడిపోతారా, లేదా అనే అభిప్రాయాన్ని అన్ని జిల్లాల నుంచి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాజధాని కాబట్టి హైదరాబాదు నుంచి విడిపోతారా, లేదా అనే అభిప్రాయం ముఖ్యమని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన సమస్య చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే రెఫరెండం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత 53 ఏళ్లలో రాయలసీమ, కోస్తా ప్రాంతాల కన్నా తెలంగాణయే ఎక్కువ అభివృద్ధి చెందిందని అందరూ అంగీకరించారని ఆయన అన్నారు. 2009 ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇవ్వలేదని, సోనియా గాంధీ కూడా జై ఆంధ్రప్రదేశ్ అన్నారని ఆయన చెప్పారు. విద్యార్థుల ముసుగులో వేరే వ్యక్తులు మంగళవారం తనపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తాను తెలంగాణ విద్యార్థులను తాలిబన్లతో పోల్చలేదని, విద్యార్థులను తాలిబన్లుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మాత్రమే అన్నానని ఆయన వివరణ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X