వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజకీయ పార్టీలకు బుద్ధి రావాలి: కావూరి సాంబశివరావు
రాష్ట్ర విభజన చేయాలనుకుంటే అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కన్నా తెలంగాణ ప్రాంతమే ఎక్కువ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. అభివృద్ధి మాట వచ్చే సరికి తెలంగాణ సెంటిమెంటు, ఆత్మగౌరవం గురించి తెలంగాణవాదులు మాట్లాడుతున్నారని, వాటికి విలువ ఇచ్చి రాష్ట్రాన్ని విభజించడం ప్రమాదకరమని ఆయన అన్నారు. అ మాటకొస్తే అందరికీ ఆత్మగౌరవం ఉందని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, January 6, 2010, 14:35 [IST]