వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ పార్టీలకు బుద్ధి రావాలి: కావూరి సాంబశివరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Sambhasiva Rao
న్యూఢిల్లీ: రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలంటే రాజకీయ పార్టీలుకు బుద్ధయినా రావాలి లేదా కేంద్ర ప్రభుత్వం కఠినంగానైనా వ్యవహరించాలని కాంగ్రెసు కోస్తాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగాలని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. రాష్ట్ర విభజనకు సెంటిమెంటును ఆధారంగా తీసుకుంటే దేశం ముక్కలు చెక్కలవుతుందని ఆయన అన్నారు. అది రాష్ట్ర ప్రయోజనాలకే కాకుండా దేశ ప్రయోజనాలకు కూడా ప్రమాదమని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన చేయాలనుకుంటే అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కన్నా తెలంగాణ ప్రాంతమే ఎక్కువ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. అభివృద్ధి మాట వచ్చే సరికి తెలంగాణ సెంటిమెంటు, ఆత్మగౌరవం గురించి తెలంగాణవాదులు మాట్లాడుతున్నారని, వాటికి విలువ ఇచ్చి రాష్ట్రాన్ని విభజించడం ప్రమాదకరమని ఆయన అన్నారు. అ మాటకొస్తే అందరికీ ఆత్మగౌరవం ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X