పూర్తి కాలం గవర్నర్ గా నరసింహన్?

Narasimhan
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి గవర్నర్ గా ఇఎస్ఎల్ నరసింహన్ ను కొనసాగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చత్తీస్ ఘడ్ గవర్నర్ గా కొనసాగుతున్న ఆయన ఆంధ్రప్రదేశ్ కు తాత్కాలిక గవర్నర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పూర్తిస్థాయి గవర్నర్ గా కొనసాగాలని కేంద్ర ప్రభుత్వం నరసింహన్ ను అడిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల అఖిల పక్ష సమావేశం వివరాలను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మంగళవారం రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్ కు వివరించారు. సంప్రదింపుల ప్రక్రియకు రాజకీయ పార్టీలు అంగీకరించాయని చిదంబరం చెప్పినట్లు సమాచారం. చర్చల ప్రక్రియ పూర్తికి నిర్దిష్ట కాలపరిమితిని విధిస్తామని రాజకీయ పార్టీలకు తాను చెప్పిన విషయాన్ని కూడా ఆయన ప్రధానికి తెలియజేసినట్లు సమాచారం.

కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను పూర్తి కాలం గవర్నర్ గా కొనసాగించే విషయంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చత్తీస్ ఘడ్ పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహించడం సాధ్యం కాదని నరసింహన్ అభిప్రాయపడితే చత్తీస్ ఘడ్ కు మరో గవర్నర్ ను వేస్తామని చెప్పే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కొనసాగడానికి నరసింహన్ ఇష్టపడకపోతే మరో రెండు నెలల పాటు కొనసాగాలని అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్రానికి సమర్ధుడైన ముఖ్యమంత్రిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+