వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేయి దాటితే రాష్ట్రపతి పాలన: ముఖ్యమంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
రాజమండ్రి: పరిస్థితి చేయి దాటితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావచ్చునని ముఖ్యమంత్రి కె. రోశయ్య హెచ్చరించారు. యానాం ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్తూ ఆయన బుధవారం రాజమండ్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని, ఏ ప్రాంతం పట్లా తనకు ప్రత్యేక అభిమానం గానీ ప్రత్యేక వ్యతిరేకత గానీ లేవని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, ప్రజలందరూ అలాగే ఉండాలని ఆయన అన్నారు. ఢిల్లీ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కేంద్రం తొలి అడుగు వేసిందని, సమస్యను త్వరలో పరిష్కరిస్తుందని ఆయన అన్నారు.

ఆందోళనల వల్ల రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మందగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వాదాయం తగ్గు ముఖం పట్టడం వల్ల పథకాల అమలు కష్టంగా ఉందని ఆయన అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అని, తనకు అన్ని ప్రాంతాలు సమానమేనని ఆయన అన్నారు. ఆందోళనల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రోజుకు వంద కోట్ల రూపాయలు తగ్గిందని ఆయన చెప్పారు. ఆందోళనల వల్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయని, దాని వల్ల అభివృద్ధి కూడా కుంటుపడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రం నుంచి బయటకు వెళ్లవద్దని సినీ, ఐటి రంగాలను కోరానని, తగిన రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X