వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణా జిల్లా మామిడి రైతులకు 24 కోట్ల పరిహారం
283 గ్రామాల్లోని 53,475 హెక్టార్లలో మామిడిని మంగు తెగులు పీడించింది. ఈ కారణంగా నష్టపోయిన 56,939 మంది రైతులకు రూ.24 కోట్లు పరిహారం మంజూరు చేశారు. 246 గ్రామాల్లో 7,384 హెక్టార్లలో నాసిరకం మిర్చి వల్లదెబ్బతిన్న 16,074 మంది రైతులకు రూ.1.83 కోట్లు పరిహారం మంజూరైంది. 73 వేల మంది రైతులకు ఈ మొత్తాన్ని డీడీల రూపంలో పంపిణీ చేయాలంటే జాప్యం జరుగుతుందని భావించిన జిల్లా అధికారులు నేరుగా రైతుల బ్యాంక్ ఎకౌంట్లలో జమ చేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. వివిధ మండలాల్లో రైతులకు ఇప్పటికే రూ.16.77 కోట్లు పరిహారం అందింది. మిగిలిన వారికి కూడా త్వరితగతిన ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 11 జిల్లాల్లో మామిడి, మిర్చి రైతులు నష్టం వాటిల్లగా, కృష్ణా జిల్లాకే ఎక్కువగా పరిహారం అందిందని అధికారులు తెలిపారు.
Story first published: Friday, January 8, 2010, 14:36 [IST]