వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా జిల్లా మామిడి రైతులకు 24 కోట్ల పరిహారం

By Santaram
|
Google Oneindia TeluguNews

Mango Tree
మచిలీపట్నం: జిల్లాలో మంగు తెగులు వల్ల నష్టపోయిన మామిడి రైతులకు రూ.24 కోట్లు పరిహారం మంజూరైంది. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మిర్చి రైతులకు కూడా రూ.1.83 కోట్లు నష్టపరిహారం అందజేస్తున్నారు. 2008లో తెగుళ్ల కారణంగా అతలాకుతలమైన రైతులను ఆదుకుంటామని రైతు శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఇలాంటి నష్టానికి కేంద్రం నుంచి సహాయం అందించాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వమే భరించడానికి ముందుకు వచ్చింది. వైఎస్‌ మృతి తర్వాత ఈ నిధులు మంజూరు కావడంలో జాప్యమవ్వడంతో రైతులు దీనిపై ఆశలు వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇటీవల పరి హారం అందడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

283 గ్రామాల్లోని 53,475 హెక్టార్లలో మామిడిని మంగు తెగులు పీడించింది. ఈ కారణంగా నష్టపోయిన 56,939 మంది రైతులకు రూ.24 కోట్లు పరిహారం మంజూరు చేశారు. 246 గ్రామాల్లో 7,384 హెక్టార్లలో నాసిరకం మిర్చి వల్లదెబ్బతిన్న 16,074 మంది రైతులకు రూ.1.83 కోట్లు పరిహారం మంజూరైంది. 73 వేల మంది రైతులకు ఈ మొత్తాన్ని డీడీల రూపంలో పంపిణీ చేయాలంటే జాప్యం జరుగుతుందని భావించిన జిల్లా అధికారులు నేరుగా రైతుల బ్యాంక్‌ ఎకౌంట్లలో జమ చేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. వివిధ మండలాల్లో రైతులకు ఇప్పటికే రూ.16.77 కోట్లు పరిహారం అందింది. మిగిలిన వారికి కూడా త్వరితగతిన ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 11 జిల్లాల్లో మామిడి, మిర్చి రైతులు నష్టం వాటిల్లగా, కృష్ణా జిల్లాకే ఎక్కువగా పరిహారం అందిందని అధికారులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X