తెలంగాణ ప్రక్రియ మొదలైంది: కె కేశవరావు

K Kesava Rao
ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఎప్పుడో మొదలైందని, ఇప్పుడు చర్చల ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. ఈ ఏడాదే తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కాంగ్రెసు నాయకుడు అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డిని పరామర్శించడానికి మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, శ్రీధరబాబులతో కలిసి ఆయన శుక్రవారం ఇక్కడికి వచ్చారు. తెలంగాణ విషయాలను మీడియా వక్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. స్పీకర్ పై రాజీనామాల ఆమోదానికి ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరి కాదని కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పారని ఆయన అన్నారు. తమకు పదవుల కన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ముఖ్యమంత్రి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర బాబు అన్నారు. తాము రాజీనామాలను ఉపసంహరించుకోలేదని వారు చెప్పారు. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఇంద్రకరణ్ రెడ్డి దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో కాంగ్రెసు కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+