వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ పద్ధతేం బాగా లేదు: వి హనుమంతరావు
గ్యాస్ తవ్వకాలకు మాత్రమే ప్రైవేట్ సంస్థలు పరిమితమవుతాయని, గ్యాస్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వమే చేస్తుందని, ఈ విషయం తెలియకుండా వార్తాకథనాలు ప్రసారం చేశారని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ చానెళ్లు పెట్టి ప్రజలను రెచ్చగొడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు ప్రచారం అక్కర్లేదని, ప్రజలను రెచ్చగొట్టే ప్రసారాలు చేయవద్దని ఆయన మీడియాకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సోనియా గాంధీ, చిదంబరం కట్టుబడి ఉన్నారని తెలిసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి వైయస్ మరణ కథనాన్ని ప్రసారం చేశారని ఆయన విమర్శించారు. శాంతిభద్రతల సమస్య సృష్టించి రాష్ట్రపతి పాలన రావాలని చూస్తున్నారని, తమ పార్టీవారే రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని, రాష్ట్రపతి పాలన వస్తే తెలంగాణ ఏర్పాటు వెనక్కి పోతుందని వారు భావిస్తున్నారని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, January 8, 2010, 13:47 [IST]