వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాల ఉపసంహరణకు డి శ్రీనివాస్ ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్లతో చేసిన రాజీనామాలను ఉపసంహరించుకోవాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పార్టీ శాసనసభ్యులపై ఒత్తిడి పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు స్పష్టమైన ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ్యులు, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటామని చెప్పాలంటూ సీమాంధ్ర శాసనసభ్యులు రాజీనామా చేశారు. వారి చేత రాజీనామాలు ఉపసంహరింపజేయాలని పార్టీ అధిష్టానం డిఎస్ ను ఆదేశించింది. దీంతో ఆయన రంగంలోకి దిగారు.

గత రెండు రోజులుగా శ్రీనివాస్ పార్టీ శాసనసభ్యులకు ఎస్ఎంఎస్ లు పంపుతూ రాజీనామాలు ఉపసంహరించుకోవాలని పార్టీ శాసనసభ్యులకు సూచిస్తున్నారు. శాసనసభ్యులకు ఆయన ఫోన్ లు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొన్న తర్వాతనే రాష్ట్ర విభజనపై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు చెప్పింది. దీంతో తొలుత కాంగ్రెసు శాసనసభ్యుల చేత రాజీనామాలు ఉపసంహరింపజేయాలనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు సోమవారం హైదరాబాదులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కోసం గట్టిగా పట్టుపడుతున్న మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి సోమవారం హైదరాబాదు వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X