వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవి5 జర్నలిస్టులకు బెయిలు మంజూరు

By Pratap
|
Google Oneindia TeluguNews

TV5 Editors
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై కుట్ర వార్తాకథనం ప్రసారం చేసి అరెస్టయిన టీవీ5 తెలుగు టీవీ చానెల్ ప్రతినిధులు బ్రహ్మానందరెడ్డి, వెంకటకృష్ణలకు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై వారిద్దరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సంబంధించి విచారణ పూర్తయ్యేంత వరకు ఏ విధమైన వార్తాకథనాలు ప్రసారం చేయకూడదని, విచారణపై కూడా ఏ విధమైన వార్తా కథనం ప్రసారం చేయకూడదని కోర్టు వారికి షరతులు పెట్టింది. కాగా, కోర్టు ఆదేశాలు చంచల్ గుడా జైలుకు సాయంత్రం ఆరు గంటలలోగా అందితే వారిద్దరు సోమవారం సాయంత్రం విడుదలవుతారు. లేదంటే వారి విడుదల రేపటికి వాయిదా పడవచ్చు. రష్యన్ వెబ్ సైట్ ది ఎగ్జైల్డ్ వార్తాకథనం ఆధారంగా టీవీ5తో పాటు మరో రెండు టీవీ చానెళ్లు వైయస్ మృతికి కుట్ర జరిగిందనే వార్తాకథనాన్ని ప్రసారం చేశాయి. ఈ కేసులో టీవీ5 జర్నలిస్టులపై కేసు నమోదు చేసి సిఐడి పోలీసులు వారిని అరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X