వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణా జిల్లాలో సమైక్యాంధ్ర భోగిమంటలు
ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ, టీడీపీ నాయకులు మాదిరెడ్డి అంజిబాబు, ఎస్బీహెచ్ మేనేజరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే సమైక్యాంధ్రా జెండాను టీడీపీ నాయకుడు అంజిబాబు కుమారుడు మాదిరెడ్డి శ్రీశైలేష్ చేత పట్టుకుని భోగిమంటల వద్ద ప్రదర్శించడం పలువుర్ని ఆకర్షించింది. పెడనలో మహిళలు తమ ఇళ్ల ముందు సమైక్యాంధ్ర ముగ్గులు వేసి ఆంధ్రులందరూ కలసి ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
Comments
Story first published: Thursday, January 14, 2010, 12:15 [IST]