కృష్ణా నుంచి గోదావరికి తరలిపోయిన పందెం కోళ్ళు

Cock Fights
విజయవాడ: విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ కూడా కమిషనరేట్‌ పరిధిలో కోడిపందాలు జరగకుండా చర్యలు చేపట్టారు. దీంతో కమిషనరేట్‌ పరిధిలోగానీ, జిల్లాలోగానీ ఎక్కడా కోడిపందాలు వేసే అవకాశం లేకపోవడంతో పందెంరాయుళ్ళు గోదావరి జిల్లాకు తరలిపోయారు. భారీ వాహనాలతో సైతం బారులు తీరుతూ వెళ్ళినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఐ భీమవరం, ఉండి, చింతలపూడి, ములగలంపాడు తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో కోడిపందాలు జరుగనున్నట్లు సమాచారం అందడంతో వీరంతా ఆయా ప్రాంతాలకు తరలిపోయారు. భీమవరంలో ఏ లాడ్జి చూసినా ఒక్క గదికూడా ఖాళీ లేదని తెలుస్తోంది. నేడు కనుము కాబట్టి పందేలు ఇంకా జోరుగా జరిగే అవకాశముంది.

భారీ వాహనాల సమూహాలతోపాటు లక్షలాది రూపాయలతో ఈ పందాలకు తరలివెళ్ళారు. జిల్లాలో కోడిపందాలకు నూజివీడు ప్రాంతం ప్రసిద్ధి కాగా జిల్లా ఎస్పీ రామ కృష్ణయ్య కోడిపందాలు వేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిక చేశారు. ఇదే సందర్భంలో నూజివీడు ఎఎస్పీ రాజకుమారి ఈ విషయంలో తీవ్రంగా స్పందించి కోడిపందాల వేసేవారి కదలికలు సైతం కనిపెడుతూ అటువారిపై చర్యలకు సిద్ధంగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+