కనువిందు చేసిన సుదీర్ఘ సూర్యగ్రహణం

ఢిల్లీలో ఉదయం 11 గంటల 53 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. నెహ్రూ ప్లానిటోరియం నుంచి సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, సూర్యగ్రహణం ప్రభావాన్ని తెలుసుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఉపరితలంలోకి రాకెట్లను ప్రయోగించింది. సూర్యగ్రహనానికి ముందు, తర్వాత వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకోవడానికి ఇస్రో ఈ రాకెట్లను ప్రయోగించింది. సూర్యగ్రహణం సమయంలో హరిద్వార్ లోని కుంభమేళా ఆగిపోయింది.
హైదరాబాదులో సూర్యగ్రహణం పాక్షికంగా కనిపించింది. సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు హైదరాబాదులోని బిర్లా ప్లానిటోరియానికి పెద్ద యెత్తున ప్రజలు చేరుకున్నారు. చిన్నారులతో సహా ఎంతో మంది ఆసక్తిగా సూర్యగ్రహణాన్ని వీక్షించారు. హైదరాబాదులో మబ్బులు అలుముకున్నాయి. అయితే తర్వాత అవి తొలగిపోవడంతో సూర్యగ్రహానాన్ని వీక్షించేందుకు వీలు కలిగింది. హైదరాబాదులోని 77 శాతం మాత్రమే దర్సనమిచ్చింది. కాళహస్తీశ్వర ఆలయం తప్ప రాష్టంలోని అన్ని ఆలయాలను సూర్యగ్రహణం సందర్బంగా మూసేశారు. గ్రహణం వీడగానే విజయవాడలోని కృష్ణానదిలో ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. గోదావరి నిదిలోనూ ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించారు. గ్రహణం వల్ల ఏ విధమైన అరిష్టాలు ఉండవని వాదిస్తూ జన విజ్ఞాన వేదిక హైదరాబాదులోని ట్యాంకుబండుపై సామూహిక భోజనాలు ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications