రెచ్చిపోం, కానీ సహించం: దామోదర్ రెడ్డి

R Damodar Reddy
హైదరాబాద్: సీమాంధ్ర నాయకులు రెచ్చగొడితే తాము రెచ్చిపోమని, అయితే అనవసరంగా మాట్లాడితే సహించబోమని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరంలో ఆయన శనివారం మాట్లాడారు. తాము మగవాళ్లం, వీరులం అని నిరూపించుకుంటామని ఆయన అన్నారు. ఇది చారిత్రికమైన దినమని ఆయన అన్నారు. కేంద్రమే హైదరాబాదుకు దిగిరావాలని ఆయన అన్నారు.

తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రాంతమూ ప్రజలూ ముఖ్యమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధించి తీరుతామని ఆయన ప్రకటించారు. జెఎసి నిర్ణయాలకు కట్టుబడి తాము ఉద్యమంలో పని చేస్తామని ఆయన చెప్పారు. గత యాభై ఏళ్లుగా అసమానతలు కొనసాగుతున్నా సహించామని, ఇక సహించబోమని ఆయన అన్నారు. తాము ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిస్తామని ఆయన చెప్పారు. విద్యార్థులు బలిదానాలు చేయకూడదనే ఉద్దేశంతో తాము ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. జెండాలను, పార్టీలను పక్కన పెట్టి ప్రత్యేక తెలంగాణే ఎజెండాగా తాము ఉద్యమిస్తున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+