వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడో రోజుకు చేరిన జెఎసి దీక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telengana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనను డిమాండ్ చేస్తూ ప్రారంభించిన తెలంగాణ జెఎసి నేతల రిలే నిరాహార దీక్షలు సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. జెఎసి కన్వీర్ కోదండరామ్ తో సహా పలువురు ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జెఎసి నేతలు శనివారం ఈ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.

తెలంగాణ వస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. సింగరేణి తాడిచర్ల కాంట్రాక్టుపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ స్థలాన్ని యాజమాన్యానికే అప్పగించాలని ఆయన కోరారు. తెలంగాణలో దళితుల వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు కోనేరు రంగారావు కమిటీ తేల్చిందని బిజెపి సీనియర్ విద్యాసాగర్ అన్నారు. తెలంగాణ వస్తేనే ఆ భూములను రక్షించుకోగలుగుతామని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X