హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనను డిమాండ్ చేస్తూ ప్రారంభించిన తెలంగాణ జెఎసి నేతల రిలే నిరాహార దీక్షలు సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. జెఎసి కన్వీర్ కోదండరామ్ తో సహా పలువురు ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జెఎసి నేతలు శనివారం ఈ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ వస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. సింగరేణి తాడిచర్ల కాంట్రాక్టుపై ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ స్థలాన్ని యాజమాన్యానికే అప్పగించాలని ఆయన కోరారు. తెలంగాణలో దళితుల వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు కోనేరు రంగారావు కమిటీ తేల్చిందని బిజెపి సీనియర్ విద్యాసాగర్ అన్నారు. తెలంగాణ వస్తేనే ఆ భూములను రక్షించుకోగలుగుతామని అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి