వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పష్టత లేకనే ఆత్మహత్యలు: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Etala Rajendar
హైదరాబాద్: తెలంగాణపై స్పష్టత లేకపోవడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్యకు జెఎసి మంగళవారం నివాళులు అర్పించింది. తెలంగాణ కోసం ప్రజాప్రతినిధుల రిలే నిరాహార దీక్షలు మంగళవారంనాడు నాలుగో రోజు కూడా కొనసాగాయి. పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని, ఆత్మబలిదానాలు చేసుకోవద్దని కోదండరామ్ విద్యార్థులను కోరారు. తెలంగాణ పోరాటాలు జరుగుతున్న ఈ సమయంలో కూడా ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని, తెలంగాణ రైతులకు పంటల బీమా నిధులు విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పంటల బీమా నిధులను రైతులకు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ఏర్పాటే విద్యార్థుల ఆత్మహత్యలకు పరిష్కారమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ మంగళవారం అన్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి వెంటనే తెలంగాణకు కాలపరిమితితో కూడిన కార్యాచరణనను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. వేణుగోపాల్ రెడ్డి తల్లిదండ్రులు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరుకుని బోరుబోరున విలపిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కన్నీటి సంద్రమైంది. కేంద్ర ప్రభుత్వం, రాజీనామాలు చేయని తెలంగాణ ప్రజాప్రతినిధులపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X