వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిలాఫలకాలపై లేవి పేరు: మంత్రి పనబాక కినుక

By Santaram
|
Google Oneindia TeluguNews

Panabaka Lakshmi
గుంటూరు: తెనాలి పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాలపై తనపేరు వేయలేదని కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి కినుక వహించారు. మంత్రి పనబాక లక్ష్మి గురువారం ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనలో పాల్గొన్నారు. తెనాలిలో సీఎం రోశయ్య పొట్టిశ్రీరాములు, కవి తెనాలి రామకృష్ణుడు విగ్రహాలను ఆవిష్కరించారు.

ఈ విగ్రహాల శిలాఫలకాలపై జిల్లాలోని మంత్రులు, ఇతర ముఖ్య నేతల పేర్లు ఉన్నాయి. కేంద్రమంత్రిగా తనపేరు లేదని పనబాక లక్ష్మి కినుక వహించారు. అదేవిధంగా తెనాలి పురపాలక సంఘం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన పైలాన్‌పై కూడా మంత్రి పనబాక పేరు లేదని అనుచరులు ఆమె దృష్టికి తెచ్చారు.

దీంతో ప్రొటోకాల్‌ నిబంధనలపై ఆమె ఆరా తీశారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం గుంటూరు లోక్‌సభ పరిధిలో ఉంది. అందువలన పనబాక లక్ష్మి పేరు శిలాఫలకాలపై వేయలేదని స్థానిక అధికారులు వివరణ ఇచ్చారు. కేంద్రమంత్రిగా జిల్లాలో ప్రొటోకాల్‌ నిబంధనలు మంత్రి పనబాకకు వర్తిస్తాయని అనుచరులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో మంత్రి పనబాక అనుచరులు గురువారం రాత్రి తెనాలిలో తమ నేత పేరు శిలాఫలకాలపై వేయలేదని గుంటూరులోని ప్రొటోకాల్‌ అధికారుల దృష్టికి తెచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X