వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రాప్యారిస్ గా తెనాలికి పూర్వ వైభవం: రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
తెనాలి: తెనాలి పురపాలక సంఘంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ పథకం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ కొణిజేటి రోశయ్య హామీ ఇచ్చారు. గురువారం రాత్రి తెనాలి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో జరిగిన పురపాలక సంఘ శతాబ్ది వేడుకల ప్రారంభ సభలో ముఖ్య మంత్రి రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రోశయ్య మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘం అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. తెనాలి పట్టణాన్ని ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.

పట్టణంలోని మారుమూల వీధుల వెడల్పునకు కృషి చేయాలన్నారు. ఆంధ్రాప్యారిస్‌కు తగ్గట్టుగా తెనాలిని సుందరంగా తీర్చి దిద్దాలన్నారు. ముఖ్యమంత్రిగా తాను ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తానన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రణాళిక బద్ధంగా అమలు చేస్తామన్నారు. మహిళల సాధికారత పావలా వడ్డీ రుణాలు కలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, మనమందరిపై ఉందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X