వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పడవ బోల్తా: పద మంది మృతి, 23 మంది గల్లంతు

By Pratap
|
Google Oneindia TeluguNews

West Godavari
నర్సాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద గోదావరి నది ఉప్పుటేరులో నాటుపడవ బోల్తా పడి పది మంది మృతి చెందగా, 23 మంది గల్లంతయ్యారు. శనివారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది వద్ద సముద్ర స్నానానికి వెళ్తుండగా పడవ బోల్తా పడింది. పౌర్ణమి కావడంతో వారు సముద్ర స్నానానికి బయలు దేరారు.

పడవలో 40 మందికి పైగా ప్రయాణికులున్నట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 9 గంటల వరకు పది మృతదేహాలను వెలికి తీశారు. అంతర్వేదిలో పాలెం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు జరుగుతాయి. శనివారం ఉత్సవాల చివరి రోజు కావడంతో సముద్రస్నానానికి వారు అంతర్వేదికి బయలుదేరారు. అంతర్వేది సముద్రంలో గోదావరి నది సంగమించే చోటు. దీంతో సముద్రం ఆటపోట్ల ప్రభావం అక్కడ తీవ్రంగా ఉంటుంది.

పడవ ప్రమాదంలో 25 నుంచి 30 మంది దాకా గల్లంతయినట్లు ప్రాథమిక సమాచారమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్ చెప్పారు. సహాయక చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఎదురుగా వస్తున్న ఖాళీ పడవ ప్రయాణికులతో వెళ్తున్న పడవ తాకడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోందని ఆమె చెప్పారు. కాగా, పడవలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X