వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పడవ బోల్తా: పద మంది మృతి, 23 మంది గల్లంతు
పడవలో 40 మందికి పైగా ప్రయాణికులున్నట్లు సమాచారం. అయితే శనివారం ఉదయం 9 గంటల వరకు పది మృతదేహాలను వెలికి తీశారు. అంతర్వేదిలో పాలెం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు జరుగుతాయి. శనివారం ఉత్సవాల చివరి రోజు కావడంతో సముద్రస్నానానికి వారు అంతర్వేదికి బయలుదేరారు. అంతర్వేది సముద్రంలో గోదావరి నది సంగమించే చోటు. దీంతో సముద్రం ఆటపోట్ల ప్రభావం అక్కడ తీవ్రంగా ఉంటుంది.
పడవ ప్రమాదంలో 25 నుంచి 30 మంది దాకా గల్లంతయినట్లు ప్రాథమిక సమాచారమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వాణీ ప్రసాద్ చెప్పారు. సహాయక చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఎదురుగా వస్తున్న ఖాళీ పడవ ప్రయాణికులతో వెళ్తున్న పడవ తాకడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోందని ఆమె చెప్పారు. కాగా, పడవలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు
Comments
Story first published: Saturday, January 30, 2010, 12:50 [IST]