బిసి నేత కారుపై దాడి: హత్య, కిడ్నాప్
సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - కారు అద్దాలు పగిలినట్లు శబ్దం రావడంతో డ్రైవర్ కారును ఆపాడు. రెండు బైకులపై వచ్చిన కుర్రాళ్లు కారుపై దాడి చేసి డ్రైవర్ ను కత్తితో పొడిచి కింద పడేశారు. ఈ సమయంలో ప్రభాకర్ కుమారుడు కారు దిగి తప్పించుకున్నాడు. బాలికను తీసుకుని దుండగులు అదే కారులో పారిపోయారు. ప్రభాకర్ కు చెందిన ఎపి 03/ఆర్2333 అనే నెంబర్ కారు కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటనా స్థలంలో కత్తి పడి ఉంది.
వ్యాపార లావాదేవీల వల్ల ఈ సంఘటన జరిగిందా, డబ్బుల కోసమే ఈ కిడ్నాప్ జరిగిందా అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. తనకు శత్రువులు ఎవరూ లేరని, ఎవరి మీద కూడా తనకు అనుమానం లేదని పలగాని ప్రభాకర్ అంటున్నారు. ఎందుకు ఈ సంఘటన జరిగిందో తెలియడం లేదని ఆయన చెబుతున్నారు. నిందితులను కొద్ది సేపట్లో గుర్తించగలమని పోలీసులు అంటున్నారు. ప్రతి రోజు తన ఇద్దరు పిల్లలను డ్రైవర్ పాఠశాలకు తీసుకెళ్తాడని, అదే విధంగా ఈ రోజు కూడా వెళ్లాడని ఆయన చెప్పారు. ముగ్గురు దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాలికను తీసుకుని వెళ్లిన దుండగులు కొద్ది సేపట్లోనే కారులో విజయవాడ దాటినట్లు అనుమానిస్తున్నారు. గతంలో కూడా ఈ బాలికను కిడ్నాప్ చేశారు.