మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా: రఘువీరా

Raghuveera Reddy
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద గోదావరి నది ఉప్పుటేరులో నాటుపడవ బోల్తా పడి మరణించినవారి కుటుంబాలకు జిల్లా ఇంచార్జీ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సిఎం సహాయ నిధి నుంచి రూ. 50 వేల చొప్పున, ఆపద్భంధు పథకం కింద మరో 50 రూపాయలేసి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదంపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు.

ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన తెలిపారు. ముగ్గురు గల్లంతైనట్లు వారి బంధువులు చెబుతున్నారని ఆయన అన్నారు. 25 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని, వారిలో ఆరుగురిని ఆస్పత్రికి తరలించారని ఆయన వివరించారు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, విశాఖ నుంచి హెలికాప్టర్లను సంఘటనా స్థలానికి పంపించామని ఆయన వివరించారు. హెలికాప్టర్, రెండు లైట్ బోట్లు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ప్రమాద స్థలికి ఆయన బయలుదేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+