వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా: రఘువీరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద గోదావరి నది ఉప్పుటేరులో నాటుపడవ బోల్తా పడి మరణించినవారి కుటుంబాలకు జిల్లా ఇంచార్జీ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సిఎం సహాయ నిధి నుంచి రూ. 50 వేల చొప్పున, ఆపద్భంధు పథకం కింద మరో 50 రూపాయలేసి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదంపై ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు.

ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన తెలిపారు. ముగ్గురు గల్లంతైనట్లు వారి బంధువులు చెబుతున్నారని ఆయన అన్నారు. 25 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని, వారిలో ఆరుగురిని ఆస్పత్రికి తరలించారని ఆయన వివరించారు. గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, విశాఖ నుంచి హెలికాప్టర్లను సంఘటనా స్థలానికి పంపించామని ఆయన వివరించారు. హెలికాప్టర్, రెండు లైట్ బోట్లు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. ప్రమాద స్థలికి ఆయన బయలుదేరి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X