వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పడవ బోల్తా: రోశయ్య విచారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద గోదావరి నది ఉప్పుటేరులో నాటుపడవ బోల్తా పడిన సంఘటనపై ముఖ్యమంత్రి కె. రోశయ్య విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆయన మంత్రి వసంత కుమార్ ను ఆదేశించారు. దాంతో వసంత కుమార్ అక్కడికి చేరుకున్నారు.


జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి మృతుల కుటుంబాలను ఆదుకుంటామని జిల్లా ఇంచార్జీ మంత్రి రఘువీరా రెడ్డి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మరో మంత్రి పితాని సత్యనారాయణ హామీ ఇచ్చారు. పడవ ప్రమాదంపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

కాగా, మృతుల సంఖ్య 12కు చేరినట్లు సమాచారం. స్థానికులు 40 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పుటేరులో పడవ బోల్తా పడిన విషయం తెలిసిందే. మృతులు మొగల్తూరు, దర్నరేవు, బియ్యపుతిప్పలకు చెందినవారని తెలుస్తోంది. మృతులకు రాష్ట్ర మంత్రివర్గం కూడా సంతాపం ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X