ఈ వారంలోనే తెలంగాణ కమిటీ: చిదంబరం

కమిటీ లేదా యంత్రాంగం కోసం వేచి చూడాలని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలించిందని ఆయన చెప్పారు. తాము వేసే కమిటీ వివరాలు రహస్యంగా ఏమీ ఉండవని ఆయన మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిన్నపాటి ఆందోళనలు, నిరసనలు మినహా ఆంధ్రప్రదేశ్ లో భారీ హింసాత్మక సంఘటనలేవీ జరగలేదని, పరిస్థితి ప్రశాంతంగానే ఉందని ఆయన చెప్పారు. ఆత్మహత్యల వంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల అభిప్రాయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కోరారు. కమిటీ వేయడంలో ఆలస్యమేమీ జరగలేదని, జరగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications