వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి విభజనకే కమిటీ వేయాలి: నాగం జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే ఆ కమిటీ పని చేయాలని ఆయన అన్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని జెఎసి పిలుపులో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు జెఎసి నేతలు ధర్నా చేశారు. జెఎసి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

అందరూ కలిసి ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ జెఎసి నుంచి కాంగ్రెసు విడిపోదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అరెస్టులతో తమ ఉద్యమం ఆగదని, తెలంగాణ వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో తమకు నిరసనలు తెలిపే హక్కు కూడా లేదా అని ఆయన అడిగారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్, జెఎసి నేత కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు సోమవారం ఉద్యమం సాగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X