వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు జెఎసిలో ఉంటుంది: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

JAC
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ జెఎసిలో కొనసాగుతుందని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటనను కోరుతూ తెలంగాణవ్యాప్తంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు సాగాయి. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ప్రజల మనోభావాల మేరకు జెఎసి ఏర్పడిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమైందని, ఏ ప్రభుత్వమైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన అన్నారు.

ధర్నా కార్యక్రమాలు విజయవంతంగా సాగాయని, రేపు కూడా ఆందోళన కార్యక్రమాలు సాగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర మంత్రి చిదంబరం నుంచి స్పష్టమైన ప్రకటనను కోరుతున్నామని, కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ కోసం వేచి చూస్తున్నామని ఆయన చెప్పారు. కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలకు తావు లేకుండా సీమాంధ్ర నేతలు వ్యవహరించాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X