వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమిటీ తర్వాతే జెఎసిపై నిర్ణయం: జానా

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన తర్వాతనే జెఎసి నుంచి విడిపోవాలా, లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెసు తెలంగాణ నాయకుడు కె. జానా రెడ్డి చెప్పారు. జెఎసి నుంచి తప్పుకోవాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చేసిన ప్రకనటపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు సోమవారం సమావేశమై చర్చించారు. ఈ సమావేశం వివరాలను జానా రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. కమిటీ ఏర్పడే వరకు ఎవరం ఏ ప్రకటన చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. తాము సంయమనం పాటిస్తూ సామరస్య వాతావరణానికి సహకరిస్తున్నామని, అందుకు మిగతా పార్టీలు సహకరించాలని ఆయన అన్నారు. కేంద్రం కమిటీ వేసిన తర్వాత అది తెలంగాణకు అనుకూలమో కాదో చూసి మాట్లాడుతామని ఆయన చెప్పారు. తెలంగాణేతర ప్రాంతంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను గోబ్యాక్ అంటూ అవమానించడాన్ని ఆయన ఖండించారు. సీమాంధ్ర నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదని ఆయన కోరారు. తాము సంయమనంగా ఉన్నట్లే సీమాంధ్ర నేతలు కూడా ఉండాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X