ఆ తర్వాతే తెలంగాణలో పర్యటిస్తా: చిరంజీవి

కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించబోయే కమిటీ స్వరూపం, సామర్థ్యం తెలియడం లేదని ఆయన అన్నారు. కమిటీ సభ్యులుగా న్యాయమూర్తులు, ఆర్థిక నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, అన్ని వర్గాల మేధావులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కలిసి ఉంటే ఉండే లాభాలు, విడిపోతే కలిగే నష్టాల గురించి క్షుణ్నంగా చర్చించాలని ఆయన అన్నారు. న్యాయంగా, ఎక్కువ మంది అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications