వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రం ముక్కలైతే మరోపార్టీ పుడుతుంది: టిజివి

By Santaram
|
Google Oneindia TeluguNews

TG Venaktesh
కర్నూలు: రాష్ట్రం ముక్కలైతే రాయలసీమ హక్కుల కోసం ప్రత్యేక పార్టీ ఆవిర్భవిస్తుందని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అధ్యక్షుడు, కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేశ్‌ వెల్లడించారు. మాట తప్పి చిదంబరం తెలంగాణ ప్రక్రియ కోసం కమిటీ వేస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించారు. ఏకాభిప్రాయం లేకుండా ఎటువంటి చర్యలూ తీసుకోబోమని తమకు హామీ ఇచ్చారని, ప్రస్తుత పరిస్థితి చూస్తే తెలంగాణ ఏర్పాటుకు కమిటీని వేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. రాయలసీమకు చెందిన ఎంవీ మైసూరా రెడ్డి, ఎంవీ రమణారెడ్డి లాంటివారు పార్టీలకతీతంగా ముందుకు వచ్చి సీమ హక్కులను కాపాడుకునే దిశగా సాగాలని పిలుపునిచ్చారు.

కర్నూలులో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆరేళ్లుగా ఐక్య వేదిక నెత్తీనోరు మొత్తుకుంటున్నా రాయలసీమ నాయకుల్లో కదలిక రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీమ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున అందరూ కలసి రావాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసిన వెంటనే తిరుపతిలో విద్యార్థులతో సదస్సు నిర్వహిస్తామని, అక్కడే రాయలసీమ హక్కుల కోసం భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X