వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముస్లిం రిజర్వేషన్లను కొట్టేసిన హైకోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఏడుగురు న్యాయమూర్తుతో కూడిన హైకోర్టు ధర్మాసనం ముస్లిం రిజర్వేషన్లు చెల్లవంటూ సోమవారం తీర్పు చెప్పింది. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఐదుగురు రిజర్వేషన్లను వ్యతిరేకించగా, ఇద్దరు న్యాయమూర్తులు సమర్థించారు. ఆర్థిక ప్రాతిపదికపై మాత్రమే రిజర్వేషన్లు చెల్లుతాయని, మతప్రాతిపదికపై చెల్లవంటూ హైకోర్టు అభిప్రాయపడింది.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా తాను అధికారంలోకి రాగానే ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. దీనిపై కొంత మంది హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు రిజర్వేషన్లను కొట్టేసింది. దాంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో ముస్లింల రిజర్వేషన్లను 4 శాతానికి తగ్గిస్తూ ఒబిసిల కింద రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని కూడా హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X