వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముస్లిం రిజర్వేషన్లను కొట్టేసిన హైకోర్టు
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా తాను అధికారంలోకి రాగానే ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారు. దీనిపై కొంత మంది హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు రిజర్వేషన్లను కొట్టేసింది. దాంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో ముస్లింల రిజర్వేషన్లను 4 శాతానికి తగ్గిస్తూ ఒబిసిల కింద రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని కూడా హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది.
Comments
Story first published: Monday, February 8, 2010, 12:42 [IST]