వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియా నుంచి భారత విద్యార్థుల తిరుగుముఖం

By Pratap
|
Google Oneindia TeluguNews

Australia
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో చదువుతున్న చాలా మంది భారత విద్యార్థులు స్వదేశానికి తిరుగు ముఖం పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు ఆగడం లేదు. దీంతో విద్యార్థులు అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. ఓక్కో విద్యార్థికి 12 నుంచి 20 లక్షల రూపాయల వరకు నష్టం వస్తోంది. అయినా వారు ఆస్ట్రేలియాలో ఉండడానికి సుముఖంగా లేరు. కచ్చితమైన లెక్కలేవీ లేవని, కానీ పలువు విద్యార్థులు భారతదేశానికి వెళ్లిపోతున్నారని, వెళ్లినవారు తిరిగి రావడం లేదని, జీవించడానికి తగిన పరిస్థితులు లేకపోవడమూ ఉద్యోగావకాశాలు సన్నగిల్లడమూ అందుకు కారణమని ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థుల సమాఖ్య కార్యదర్శి గౌతం గుప్తా అంటున్నారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం లక్షా 50 వేల మంది విద్యార్థులున్నారు.

నిరుడు జూన్ లో ఇక్కడికి వచ్చిన దంపతులు భర్తపై దాడి జరగడంతో మూడు నెలల్లోనే తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారని ఆయన చెప్పారు. తాము దెబ్బలు తినడానికి ఇక్కడికి రాలేదని, ఏం తప్పు చేశారని తమను కొట్టారని వారన్నారు. 2008లో ఆస్ట్రేలియాకు వచ్చిన విద్యార్థిని మరో ఆరు నెలల్లో తన కోర్సు అయిపోతుందనగా 2009 నవంబర్ లో భారత్ వెళ్లిపోయింది. తగిన అర్హతలున్నా ఆస్ట్రేలియాలో తగిన ఉద్యోగం లభించడం లేదని కూడా భారత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X