వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసెంబ్లీ: మార్క్ ఫెడ్ స్కామ్ పై దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: కడప జిల్లాలో మార్క్ ఫెడ్ లో ఎరువుల కుంభకోణం జరిగిందనే ఆరోపణపై శుక్రవారం శాననసభ దద్ధరిల్లింది. కడప జిల్లా మార్క్ ఫెడ్ లో ఎరువుల కుంభకోణంపై సభా సంఘం వేయాలని అధికార కాంగ్రెసు పార్టీ సభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి డిమాండ్ చేశారు. మార్క్ ఫెడ్ అధికారులు కుమ్మక్కయి రైతులకు చెందాల్సిన ఎరువులను బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎరువులను మార్క్ ఫెడ్ అధికారులు బాలాజీ ఫెర్టిలైజర్స్ అనే సంస్థకు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై తీవ్ర గందరగోళం చెలరేగింది. మార్క్ ఫెడ్ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డిని ఆదేశించారు. అందుకు రఘువీరా రెడ్డి అంగీకరించారు. అయితే డిఎల్ రవీంద్రా రెడ్డి, తెలుగుదేశం సభ్యులు అందుకు అంగీకరించలేదు.

బాలాజీ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్, యజమాని పేర్లు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సభ్యులు మాట వినకపోవడంతో డిప్యూటీ స్పీకర్ మనోహర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేసమైన తర్వాత సభ సద్దుమణగలేదు. కడపలో ప్రభుత్వం లేదని డిఎల్ రవీంద్రా రెడ్డి విమర్శించారు. సీనియర్ అధికారితో విచారణ జరిపిస్తామని సభ తిరిగి సమావేశమైన తర్వాత మంత్రి రఘువీరా రెడ్డి హామీ ఇచ్చారు. అయినా సభ్యులు వినలేదు. దీంతో డిప్యూటీ స్పీకర్ మరో ప్రశ్నను గందరగోళం మధ్యనే చేపట్టారు. కడప జిల్లాలో మార్క్ ఫెడ్ వ్యవహారంపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని తెలుగుదేశం సభ్యుడు రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వం నిసిగ్గుగా వ్యవహరిస్తోందని దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X