వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చలో అసెంబ్లీ విరమించుకోండి: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ రేపు శనివారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ముఖ్యమంత్రి కె రోశయ్య తెలంగాణ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు తమ వాదనలను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి వినిపించాలని కూడా ఆయన విద్యార్థులకు సూచించారు. చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా విద్యార్థుల మధ్యకు అసాంఘిక శక్తులు ప్రవేశించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని, అందువల్ల చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విద్యార్థులు విరమించుకోవడం మంచిదని ఆయన శనివారం అన్నారు.

విద్యార్థులకు చదువులకు భంగం వాటిల్లకుండా చూడాలని కూడా ఆయన అన్నారు. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఎవరైనా కొరితే ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి 1986లో జారీ అయిన 610 జీవో అమలుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, లేదంటే సభా సంఘాన్ని వేస్తానని ఆయన అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనపై, ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుపై మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై తాను శాసనసభలో సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు.

దయచేసి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి విద్యార్థులు సహకరించాలని ఆయన కోరారు. భద్రతా ఏర్పాట్లను పోలీసులు చూసుకుంటున్నారని ఆయన చెప్పారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పని మొదలైందని, ఈ స్థితిలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X