వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొడవ: అసెంబ్లీ మూడోసారి వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: సభా కార్యక్రమాలు స్తంభించడంతో మంగళవారం శాసనసభ మూడో సారి వాయిదా పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లాఠీచార్జీ, యాదయ్య ఆత్మహత్య, ఢిల్లీలో తెలంగాణ న్యాయవాదులపై వాటర్ క్యానన్ల ప్రయోగం అంశాలపై తక్షణమే చర్చించాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబట్టడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. అంతకు ముందు సభ ఇదే అంశంపై రెండు సార్లు వాయిదా పడింది. మొదటి సారి 15 నిమిషాల పాటు, రెండో సారి 30 నిమిషాల పాటు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభ సద్దుమణగలేదు.

తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయం చేపట్టాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సభ్యులు చెప్పినట్లు సభ నడవదని, కొన్ని సంప్రదాయాల ప్రకారం నడుస్తుందని స్పీకర్ చెప్పారు. విద్యార్థుల ఆత్మబలిదానాలపై ప్రభుత్వం తగిన సమయంలో ప్రకటన చేస్తుందని స్పీకర్ చెప్పినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. దీంతో సభను గంట పాటు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం తెలుగుదేశం సభ్యులు స్పీకర్ ను ఆయన ఛేంబర్ లో కలిశారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం చేత శాసనసభలో ఒక ప్రకటన చేయించాలని వారు స్పీకర్ ను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X