రోశయ్య దిగి రావాల్సిందే: నాగం జనార్దన్ రెడ్డి

లాఠీచార్జీల ద్వారా, ఇతర బలప్రయోగాల ద్వారా తెలంగాణ ప్రజలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. విద్యార్థుల ఆత్మబలిదానాలను ఆపడానికి తీర్మానం చేయలేని దుస్థితిలో శాసనసభ ఉందని ఆయన అన్నారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన ఏమైందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రోశయ్య దిగిరావాలని ఆయన అన్నారు. మరో ఇద్దరు తెలుగుదేశం శాసనసభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications