'ద్రౌపది' నవల సిగ్గుపడేలా ఉంది: ఓలేటి

నవల అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాసుకుంటారని, ఐతే ద్రౌపది, శ్రీకృష్ణులను కించపరుస్తూ యార్లగడ్డ రాసిన నవలను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేయడం సబబుగాలేదన్నారు. జ్యూరీ సభ్యులందరూ కలిసి భారతీయ విలువలను నాశనం చేశారని విమర్శించారు. అందరి లో మంచి స్థానం సంపాదించుకున్న బేతవోలు, యార్లగడ్డను వెనకేసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. యార్లగడ్డకు ఇచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో శాంతియుతంగా ఉద్యమిస్తామన్నారు. విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షుడు నీలం శేషగిరి, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారామశాస్త్రి, ధర్మ జాగరణ సమితి నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications