అసెంబ్లీ: బ్రాహ్మణి స్టీల్స్ కు నీటిపై రగడ

ప్రజావసరాలను తీర్చే విద్యుత్తు ప్రాజెక్టుకు నీరివ్వకుండా బ్రాహ్మణి స్టీల్స్ కు ఎలా ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకుని ఆర్టీపిఎస్ కు నీరివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గుండికోట నుంచి మిగులు జలాలను తరలించే సమయంలో అందులో కొంత నీటిని మాత్రమే బ్రాహ్మణి స్టీల్స్ కు ఇచ్చామని, ఆర్టీపిఎస్ కు ఇబ్బంది కలిగించే ప్రసక్తి లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి భారీ నీటిపారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి వెనకాడే ప్రభుత్వం అడగ్గానే బ్రాహ్మణీ స్టీల్స్ కు నీరు ఇవ్వడం ఏం న్యాయమని ప్రజారాజ్యం పార్టీ సభ్యులు ప్రశ్నించారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజారాజ్యం శాసనసభ్యుడు కన్నబాబు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications