వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిచయాలకే రేపటి పర్యటన: దుగ్గల్

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణలో పర్యటించాలని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అనడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. అవసరాన్ని బట్టి కమిటీ మూడు ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఆయన చెప్పారు. తమ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుని సిఫార్సులు మాత్రమే చేస్తుందని ఆయన అన్నారు. అమలుపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని ఆయన అన్నారు. మీడియా నిర్మాణాత్మక సహకారం అందించాలని ఆయన కోరారు. కమిటీకి 9 నెలలు ఎక్కువ కాలవ్యవధి కాదని ఆయన అన్నారు. తమకు తరుచుగా రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరమని ఆయన అన్నారు. ప్రజలు పరిశోధనాత్మకమైన నివేదికలు అందిస్తే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఏప్రిల్ నుంచి జులైలోగా అన్ని ప్రాంతాల్లో తాము పర్యటిస్తామని ఆయన అన్నారు.