విపక్షాల ఆందోళన: అసెంబ్లీ వాయిదా

బడ్జెట్ పై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి రోశయ్య శుక్రవారం సమాధానమిచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు వివరణ అడుగుతుండగా రోశయ్య లేచి వెళ్లిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీన్ని అక్బరుద్దీన్ శనివారం శాసనసభలో ప్రస్తావించారు. దీనిపై ముఖ్యమంత్రి వివరణ ఇస్తారని చెప్పినా వినలేదు. తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో సభను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications