వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నలుగురు పిల్లల ప్రాణాలు తీసిన బోర్డు
నెల రోజుల కిందట తాము తవ్విన గుంటను ఢిల్లీ జల్ బోర్డు మూసేయలేదు. దాని నిండా నీరుండడంతో పిల్లలు నీటిలో మునిగి మరణించారు. మృతుల బంధువులు, స్థానికులు వీధులకెక్కి నిరసన తెలిపారు. ఢిల్లీ జల్ బోర్డుపై దీనికి సంబంధించి కేసు నమోదైంది. సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఢిల్లీ జల్ బోర్డు చీఫ్ ఇంజినీరును విచారణాధికారిగా నియమించారు. రెండు రోజుల్లో చీఫ్ ఇంజినీరు నివేదిక సమర్పిస్తారని బోర్డు అధికార ప్రతినిధి సంజమ్ చీమా చెప్పారు.
Comments
Story first published: Saturday, March 6, 2010, 16:10 [IST]