రోశయ్య తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం

ప్రతిపక్షాల సభ్యుల పట్టుకు స్పీకర్ అంగీకరించలేదు. ముఖ్యమత్రి వివరణ తర్వాతనే అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పారు. దాంతో సమస్య సద్దుమణగలేదు. కాగా, స్పీకర్ కు కూడా చెప్పకుండా ముఖ్యమంత్రి సభ నుంచి వెళ్లిపోయారని, అది స్పీకర్ ను అవమానించడమేనని మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. దానిపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది. అయితే ముఖ్యమంత్రి రోశయ్య తనను అవమాన పరచలేదని, తన అనుమతి తీసుకునే శుక్రవారం సభ నుంచి వెళ్లిపోయారని స్పీకర్ చెప్పారు.












Click it and Unblock the Notifications