వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద స్వామికి ఆ చానల్ 50 కోట్లు అడిగిందా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
బెంగళూరు: స్వామి నిత్యానంద-రంజిత సెక్స్ వీడియోను మొదటిసారి ప్రసారం చేసిన ఒక టీవీ చానల్ అంతకు ముందు నిత్యానందను 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందని స్వామి పర్సనల్ లాయర్ శ్రీధర్ చెప్పారు. ఆ డబ్బు ఇవ్వనందుకు ఆ క్లిప్స్ ప్రసారం చేశారని ఆయన అన్నారు. వివాహ జీవితం దెబ్బతినడంతో రంజిత మానసికంగా కుంగిపోయిందని, స్వామి నిత్యానంద భక్తురాలిగా మారిందని ఆయన వివరించారు. సన్ టీవీ ప్రసారం చేసిన ఆ సెక్స్ క్లిప్ లో స్వామీజీ వీడియోను మార్ఫింగ్ ద్వారా చొప్పించారని, స్వామీజీకి రాసలీలలు అంటే ఏమిటో కూడా తెలియదని ఆ లాయర్ చెప్పారు. నిత్యానంద ఈ నెల 18న కుంభమేళా నుంచి బెంగళూరుకు తిరిగివస్తారని, అవరమైతే మీడియా కాన్ఫరెన్స్ పెట్టి సందేహాలను నివృత్తి చేస్తారని ఆశ్రమ వర్గాలు తెలిపాయి.

నిత్యానంద స్వామి ఎక్కడికీ పారిపోలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ముఖ్య భక్తులైన 4 వేల మందితో ఆయన కుంభమేళాకు వెళ్ళారని లాయర్ శ్రీధర్ చెప్పారు. ఆ వీడియోలో స్వామిని మార్ఫింగ్ ద్వారా చూపారని మొదట చెప్పిన శ్రీధర్ తర్వాత ఆశ్రమంలో ఉంటున్న వారి మధ్య రాజకీయాలు స్వామి వీడియో లీక్ కావడానికి కారణం కావచ్చని చెప్పడం గమనార్హం. ఆ టీవీ చానల్ ఆశ చూపిన డబ్బు కోసం కొందరు ఆశ్రమవాసులు కుమ్మక్కు అయి, ఆ వీడియో తీసి ఆ చానల్ కు అందించి ఉండవచ్చని న్యాయవాది చెప్పడం మరో విశేషం. నిత్యానంద స్వామి-రంజిత ఎఫైర్ ను న్యాయవాది చెప్పకనే చెప్పినట్టయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X