తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

8న తిరుపతిలో సమైక్యాంధ్ర మేధావుల సదస్సు

By Santaram
|
Google Oneindia TeluguNews

United Andhra
విశాఖపట్నం: సమైక్యాంధ్ర, తెలంగాణ సమస్యలకు సంబంధించి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీపై చర్చించి, నివేదికను రూపొందించేందుకు ఈనెల 8న తిరుపతిలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస కోకన్వీనర్‌ కాంతారావు తెలిపారు. శనివారం ఏయూ అంబేద్కర్‌ న్యాయ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సదస్సుకు సంబంధించిన ప్రత్యేక సంచికను విడుదల చేశారు. సమైక్యాంధ్ర రాష్ట్ర మేధావుల సదస్సు పేరిట తిరుపతిలోని శ్రీసాయి నిర్మల రామయ్య కల్యాణమండపం వద్ద దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను కోరుకునేవారంతా ఈ కమిటీని ఆహ్వానించి అభివృద్ధి, వెనుకబాటు తనంపై నివేదికను సమర్పించాలనే ఉద్ధేశంతో సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర ప్రదేశ్‌ పరిరక్షణ సమితిని నూతనంగా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రధాన కార్యదర్శిగా ఎన్‌ రాజారెడ్డి, అధ్యక్షుడిగా ఎన్‌.శ్రీహరి, ఉత్తరాంధ్ర కన్వీనర్‌గా కాంతారావు వ్యవహరిస్తారు. సమైక్యాంధ్రను కోరుకునే అన్ని జిల్లాల నాయకులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, కార్మికులు సదస్సుకు హాజరవ్వాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X